24.7 C
Hyderabad
March 29, 2024 05: 49 AM
Slider విశాఖపట్నం

రిషి కొండను నాశనం చేశారు: నారాయణ

#CPI

ఎట్టకేలకు సీపీఐ నారాయణ విశాఖ రుషికొండను సందర్శించారు. గతంలో రుషికొండ పర్యటనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రుషికొండను చూసేందుకు అనుమతించాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నేడు ఆయన రుషికొండను పరిశీలించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. కోర్టు అనుమతితో రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిపారు. కోర్టు ద్వారా అనుమతి కోరితే.. గతంలో తాను దేశంలో లేని సమయం చూసి అనుమతి ఇచ్చారని తెలిపారు. కోర్టు అనుమతి పొందాక కూడా మరో మూడు నెలలు ఎందుకు పట్టిందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.

బయట అనుకుంటున్నట్లు అక్కడ సీఎం కార్యాలయం లాంటి ఏర్పాట్లు ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. అక్కడ విలాసవంతమైన నిర్మాణం మాత్రం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన కొండను మాత్రం నాశనం చేసి.. కొండను చెక్కి పిలకలా వదిలేశారని చెప్పారు. అక్కడ ఏం కట్టినా సరే.. పాడు చేసిన ప్రకృతి మాత్రం తిరిగి రాదన్నారు. నేనైతే ప్రకృతిని రేప్ చేసినట్లుగానే భావిస్తానని వ్యాఖ్యానించారు. అయినా రుషికొండపైకి మీడియా ప్రజాప్రతినిధులను అనుమతిస్తే తప్పేంటి? కొంతమంది మంత్రుల మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న మాటల వల్లే ఈ రాద్ధాంతం అని చెప్పుకొచ్చారు. సుమారుగా 50 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారని వివరించారు.

ఇప్పటికే కొన్ని పూర్తి చేశారని.. మరి కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అందులో రూమ్స్.. విల్లాస్.. సమావేశ మందిర నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే సిబ్బంది ఉండేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు జరగడంలేదని వివరించారు. కోర్టు నుంచి తాత్కాలికంగా నిర్మాణాలకు అనుమతి తెచ్చామని అధికారులు చెప్పినట్లుగా నారాయణ మీడియాకు తెలియజేశారు.

Related posts

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం

Sub Editor

హోటల్ ఇండస్ట్రీని ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment