సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం ఎం.పి.పి గుడెపు శ్రీనివాస్ ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ లే అవుట్ స్థలంను ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేస్తున్నారని మున్సిపాలిటీ అధికారులు ఇంటి నిర్మాణంను కూల్చి వేస్తుండగా అడ్డుకున్న ఎం.పి.పి శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాన రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేని కొందరు నేతలు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు.తన ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని అన్నారు.ఇట్టి విషయాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్