కరోనా పాజిటివ్ రావడంతో గత నాలుగు రోజులుగా ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న ఆర్.యం.పి వెంకన్న నేడు తుది శ్వాస తీసుకున్నారు.
చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం నిమిత్తం నిన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
అయితే ఈ రోజు సాయంత్రం పరిస్థితి విషమించటంతో ఆర్.యం.పి వెంకన్న మరణించారు.