జనగామ జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల నేషనల్ రోడ్డు పై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా వాహనాలు ఎదురెదురుగా వెళుతుండేవి. ఎదురుగా వచ్చి లారీని చూడకుండా వేగంగా వచ్చిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొన్నది. దాంతో ఆర్టీసీ డ్రైవర్ కాలుకు స్వల్ప గాయాలు అయ్యాయి. తక్షణమే అతడిని ఎంజీఎం కు తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
previous post