విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది.
మల్కాపురం నుంచి అనకాపల్లి మార్కెట్కు వెళ్తుండగా డైట్ కాలేజ్ టర్నింగ్ లో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి ,కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.