65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీ గూడెం గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ మార్గంలో రోడ్డు పక్కన నిలబడి జర్కీన్ వేసుకుంటున్న ఒక యువకుడిని ఆల్టో కారు ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
మరణించిన యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు షారుక్ గా గుర్తించారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.