తూర్పు గోదావరి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో విషాదం ఏమిటంటే మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. పెద్దాపురం ఎడిబి రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఒక కారు లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులోని వారు ఒక పుణ్య కార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఇరుక్కున్న ఐదుగురిని బయటకు లాగి పెద్దాపురం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారులోని వారు తాళ్ళరేవు మండలం పెద్ద వలస నుండి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
previous post