ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మేడి వాగు వంతెనపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
మంగపేట మండలం బీల్ట్ కమలాపురం నుంచి మిర్చి లోడుతో వరంగల్ వైపు వస్తున్న లారీ బ్రిడ్జిపై ఉన్న డివైడర్ ను అదుపుతప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ యాకయ్య, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.