ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర పెట్రోల్ పంపు వద్ద సాయంత్రం 6 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పస్రా గ్రామానికి చెందిన చిలకపాటి రాజా, రాఘవ పట్నం చెందిన తుమ్మల చలపతి, ఎక్సెల్ పై ఇద్దరు పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చత్తీస్ గఢ్ కు చెందిన స్కార్పియో వాహనం అదుపుతప్పి ఢీ కొన్నది.
ఈ ప్రమాదంలో చిలకపాటి రాజా అక్కడికక్కడే మృతి చెందగా తుమ్మల చలపతి తీవ్రగాయాలు అయ్యాయి.
కాగా విషయం తెలుసుకున్న సీఐ అనుముల శ్రీనివాస్ ఎస్సై రవీందర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ములుగు ప్రాథమిక వైద్యశాలకు తరలించారు.
ఈ ఘటన చూసి అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. ఇదివరకే స్పీడ్ బ్రేకర్లు లేకనే పదిమంది యాక్సిడెంట్లో పెట్రోల్ పంపు వద్ద మరణించారు.
ఇకనైనా పెట్రోల్ పంపు వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.
కె. మహేందర్ గౌడ్, సత్యం న్యూస్