28.2 C
Hyderabad
April 20, 2024 12: 45 PM
Slider వరంగల్

పెంబర్తి వద్ద అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు లారీఢీ

pembarthi

జనగాం జిల్లా లో పెంబర్తి గ్రామం వద్ద బుధవారం తెల్లవారు జామున  ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొన్న సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరబాద్ కువెళ్లి తిరిగి ప్రయాణికులను తీసుకొని హన్మకొండ కు వస్తున్న క్రమం లో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మత్తుల కరణంగా వన్ వే ఉండడం వల్లన నిద్ర మత్తులో డ్రైవర్ ఉండడం తో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదాలకు గురైన వాహనాలను ప్రక్క జరిపి ప్రయాణికులను ఇతర బస్సులో పంపించారు. ఇద్దరు డ్రైవర్లను తీవ్రగాయాలు కావడం తో వారి పరిస్థితి విషమంగా వుండడం తో హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

రూ.884.43 లక్షలతో కొల్లాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్

Satyam NEWS

మార్చి 14 నుండి తిరుమలలో ఫాల్గుణ మాస ఉత్స‌వాలు

Satyam NEWS

సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. కేంద్రం కసరత్తులు..

Sub Editor

Leave a Comment