చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన 25 మందితో కూడిన ట్రాక్టరు లో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహానికి వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మయ్య ఊరుసమీపంలో ట్రాక్టర్ బోల్తా పడ్డది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆడవాళ్లు, ఒక డ్రైవర్, ఇద్దరు చిన్నపిల్లలు మరణించారు. వెంటనే సంఘటన స్థలానికి పూతలపట్టు, తవణంపల్లి, ఐరాల పోలీసులు చేరుకున్నారు. 108 అంబులెన్స్, ప్రైవేటు వాహనాల ద్వారా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది
previous post