35.2 C
Hyderabad
April 20, 2024 16: 28 PM
Slider చిత్తూరు

పూతలపట్టు వద్ద ఘోర ప్రమాదం: 6గురి మృతి

#accident

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల మండలం  జంగాలపల్లి గ్రామానికి చెందిన 25 మందితో కూడిన ట్రాక్టరు లో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహానికి వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మయ్య ఊరుసమీపంలో ట్రాక్టర్ బోల్తా పడ్డది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆడవాళ్లు, ఒక డ్రైవర్, ఇద్దరు చిన్నపిల్లలు  మరణించారు. వెంటనే సంఘటన స్థలానికి పూతలపట్టు, తవణంపల్లి, ఐరాల పోలీసులు చేరుకున్నారు. 108 అంబులెన్స్, ప్రైవేటు వాహనాల ద్వారా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది

Related posts

ఆలయాల అభివృద్ధికి నిధులు:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

ఇదేం పోలీస్?: తొలి వెలుగు యాంకర్ రఘు అరెస్టు

Satyam NEWS

అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు ఉపసంహరించాలి

Satyam NEWS

Leave a Comment