32.2 C
Hyderabad
April 20, 2024 20: 34 PM
Slider మెదక్

డెడ్లీ యాక్సిడెంట్: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒకరు మృతి

#TimmapurCrossRoad

అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణం తీశాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మిరుదొడ్డి మండలం కొండాపూర్ కు చెందిన రాజమౌళి (53) అనే వ్యక్తి మరణించాడు. రాజమౌళి సిద్దిపేట నుంచి కొండాపూర్ కి బైక్ పై వెళుతుండగా తిమ్మాపూర్ సమీపంలో హై స్కూల్ దగ్గర మెదక్ నుంచి సిద్దిపేట కు వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.

డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తలకు బలమైన గాయం కావడంతో రాజమౌళి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజమౌళి మృతి తో ఆ ఊర్లో విషాద చాయలు అలుముకున్నాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

గ్రేట్ తెలంగాణ: నడి ఎండలోనూ దుంకుతున్న నీళ్లు

Satyam NEWS

జనతా కర్ఫ్యూ: నేను ఇంట్లోనే ఉన్నాను మీరూ ఉండండి

Satyam NEWS

Road Accident: ఐదు నెలల చిన్నారితో సహా 4 గురు మృతి

Satyam NEWS

Leave a Comment