28.2 C
Hyderabad
April 20, 2024 12: 00 PM
Slider తూర్పుగోదావరి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం

Accident

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

మృతులు యానంకు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె. సత్య సంతోష్ చంద్ర, ప్రణీత్రి రిటైర్డ్ టీచర్లు కామవరపు స‌త్యనారాయణ (65), కామవరపు విజయలక్ష్మి (61) గా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ రావులపాలెంలో పెళ్లి సంబంధం కుదుర్చుకుని యంగేజ్ మెంట్ చేసుకుని తిరిగి యానం వెళ్ళుతుండగా ఈ దుర్గ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో మృతుని బంధువులు తీవ్ర శోక‌సాగ‌రంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకుని చెరువులోకి బోల్తా పడిన కారును పోలీసులు వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రాపురం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు రామచంద్రపురం డిఎస్పి కె. బాలచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు.

Related posts

శాఖా సిబ్బంది సమస్యలకు “పోలీసు సంక్షేమ దినోత్సవం”:ఎస్పీ దీపికా

Satyam NEWS

రమేష్ రెడ్డికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం హర్షణీయం

Bhavani

ఆదిలాబాద్ కమ్యూనికేషన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన గణేష్

Satyam NEWS

Leave a Comment