మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాన్నపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఆలూరు తాలూకు హాలహర్వి మండలంలో లోని చింతకుంట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ మెరేకన గౌడ్(60) అనే వ్యక్తి గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఓ పెళ్లి సంబంధం కోసం తమ గ్రామం నుండి నారాయణపురం గ్రామం వచ్చి సంబంధ విషయాలు మాట్లాడి తిరిగి బైక్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టెంపో (ఏపీ 29 టీ జ్ 6872) ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధవరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.