రాష్ట్రంలో అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో అందరం చూస్తూనే వున్నాం. అతి వేగం వల్ల ప్రమాదాలు జరుగుతూన్నాయి. అదే విధంగా రోడ్లు బాగాలేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఏకంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కుటుంబ సభ్యులు రోడ్లపై పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం సమీపంలో జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది వరకు అక్కడే ద్విచక్ర వాహనాల ప్రమాదాలు జరిగాయి. ఒకరు ప్రాణాలు కూడా వదిలారు. ఇదే పరిస్థితి మళ్ళీ రాకూడదు.
పట్టణ కేంద్రం నుండి హైదరాబాద్ వెళ్ళే దారి మార్కెట్ యార్డ్ సమీపంలో మెయిన్ రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారింది. గుంతలమయంగా మారింది. చివరికి ద్విచక్ర వాహనా దారుల పరిస్థితి అధ్వానంగా మారింది. అక్కడి నుండి వెళ్లే వాహన దారులు రోడ్డు దిగి పక్క నుండి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అక్కడే కాదు మొత్తానికి పెట్రోల్ బంక్ నుండి కల్వకోలు గ్రామం అక్కడక్కడ గుంతలమయంగా మారింది.
దీనిపై తక్షణమే చర్యలు తీసుకోండి. గుంతను మూయించండి. కొత్తగా వచ్చే వారు, అతివేగం తో వచ్చే వారు ఎవరైనా ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి రావచ్చు. లేకపోతే పూల దండలు వేసే పరిస్థితి రావచ్చు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రమాదాలను అరికట్టిన వారు అవుతారు. కొందరి కుటుంబాలు రోడ్ల పై పడే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడ్డ వారు అవుతారు. ఎలాగో మున్సిపల్ పాలకుల పరిధికి రానట్టు వుంది. చర్యలు తీసుకోగలరు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్