గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ కింద 4కోట్ల 95లక్షల రూపాయలను కేటాయించింది.
నిధులు మంజూర కావటం పట్ల నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.52.16కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం ఎస్టీ సబ్ప్లాన్ కింద నిధులు మంజూరయ్యాయి.
రోడ్లు అభివృద్ధి జరిగేందుకు కృషి చేస్తామని, వివిధ పథకాలు ద్వారా అధికంగా నిధులు మంజూరయ్యేందుకు చొరవచూపుతున్నట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.