కరోనా వైరస్ పై పోరాటం చేయడం అంటే దాని లక్షణాలను ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పడమే. కరోనా వైరస్ గురించి పూర్తిగా తెలిస్తే ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారు. కరోనా లక్షణాలు తెలియని వారే అజాగ్రత్తగా ఉంటారు. అందుకే నిర్మల్ పట్టణంలో కరోనా లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ నిర్మల్ ప్రజలకి వైరస్ లక్షణాలను ఆర్టిస్టులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.
నిర్మల్ లో మంచిర్యాల చౌరస్తా లో 20 ఫీట్ల కరోనా వైరస్ చిత్రపటాన్ని వేయించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ డిఇ సంతోష్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.