సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని నేరేడుచెర్ల మండలం కల్లూరు గ్రామపంచాయతీ పరిధిలో MGNREGS నిధుల నుంచి 5లక్షల రూపాయలతో వేయనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నేరేడుచర్ల ఎంపీపీ లకుమళ్ళ జ్యోతిబిక్షం, జడ్పిటిసి రాపోలు నర్సయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని, అలాగే నేరేడుచర్ల మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, ఎంపీడీవో ఉపేంద్రారెడ్డి, చిల్లేపల్లి సింగిల్ విండో చైర్మన్ అనంతు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మేకపోతుల శ్రీనివాస్, తెరాస బిసి సెల్ మండల అధ్యక్షుడు ఆకుల జగతయ్య గౌడ్, ఉపసర్పంచ్ సిరికొండ శ్రీనివాస్, తెరాస నాయకులు నందిపాటి గురవయ్య, కల్లూరు గ్రామశాఖ అధ్యక్ష్య, కార్యదర్శులు బుడిగే నాగరాజు మరియు సిరికొండ ప్రేమ్ కుమార్ వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.