స్థలం రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చిన వారి నుంచి గన్ పాయింట్ లో భారీ దోపిడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. చేర్యాల కు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేట లోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వచ్చారు. ప్లాట్ విక్రయ డబ్బులు 43 లక్షలు కొనుగోలు దారు నుంచి నర్సయ్య తీసుకొని డ్రైవర్ కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి కెళ్లాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్ పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్ తో కాల్చారు. మరో వ్యక్తి మరోవైపు నుంచి కారు డోర్ లు తెరిచి 43 లక్షల రూపాయల నగదు ఎత్తుకొని పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
previous post