27.7 C
Hyderabad
April 25, 2024 10: 33 AM
Slider ఆంధ్రప్రదేశ్

కామెంట్: పెద్దల సభలో దద్దమ్మలు ఉన్నారు

roja

పెద్దల సభ అయిన శాసన మండలిలో దద్దమ్మలు, దద్దోజనాలు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. పెద్దల సభ సలహా లు ఇచ్చే విధంగా వుండాలి. కానీ వివాదం సృష్టించే విధంగా వుండరాదని ఆమె అన్నారు. వ్యవస్థ లను భ్రస్టు పట్టించడం లో చంద్రబాబు డ్రైవర్ అయితే అయనకు స్టీరింగ్ యనమల రామకృష్ణుడు అని ఆమె అన్నారు.

చంద్రబాబు నాయుడు గ్యాలరీలో కూర్చుని శాసన మండలి లో ఛైర్మన్ ను ప్రభావితం చేశాడని రోజా ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలి లో ఆలస్యం చేయటం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. లోకేష్ తీరు చూస్తే బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు వుందని రోజా వ్యాఖ్యానించారు. కోసి ఉప్పు కారం పూసి కూర వండుకుంటారని దమ్ముంటే శాసన మండలి రద్దు చేయమని లొకేష్ అనటం అలాగే వుంటుందని రోజా అన్నారు. యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిని అని ఫీలవుతున్నాడని రోజా అన్నారు.

Related posts

నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుక నిర్వహించుకోవాలి

Satyam NEWS

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన విద్యార్ధిని అరెస్టు

Satyam NEWS

Leave a Comment