ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉంటాయని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ రావు అన్నారు. శనివారం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అకాల మరణంతో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకున్నారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. యశ్వంత్ రాణి, డాక్టర్. జయ చంద్ర ప్రసాద్ యాదవ్, డాక్టర్. సూర్య నాయక్, ఫార్మసిస్ట్ జి.కె.వెంకటేష్, రవి కుమార్, నర్మదా, రహీం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
previous post