37.2 C
Hyderabad
March 29, 2024 20: 43 PM
Slider గుంటూరు

ప్రభుత్వ వైద్య శాలను సందర్చించిన రోటరీ సభ్యులు

#rotaryclub

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలను బుధవారం రోటరీ క్లబ్ సభ్యులు సందర్శించారు. నరసరావుపేట లో పుట్టి అమెరికా దేశంలో వైద్యం వృత్తి లో ఉన్న నెఫ్రాలజీ డాక్టర్ సాగిరెడ్డి రాజేంద్ర బాబు రెడ్డి, 2022 – 2023 ఎలెక్ట్ గవర్నర్ తాళ్ళ రాజశేఖర్ రెడ్డి, నరసరావుపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు మెళ్ల చెరువు సుమిత్ర కుమార్, పబ్లిక్ ఇమేజ్ డైరక్టర్ ఎస్.కె.జిలానిమాలిక్ ,కోశాధికారి మల్లికార్జునరావు,మాజీ రోటరీ అధ్యక్షులు కొత్తూరి అంజనేయోలు,పాశం కృష్ణరావు,జమ్ముల రాదాకృష్ణ, ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ టి. శ్రీనివాసరావు, ఆసుపత్రి మేనేజర్ రవితేజ  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ సాగిరెడ్డి రాజేంద్ర బాబు రెడ్డి సహాయ సహకారాలతో,అమెరికా క్లబ్ సహాయ సహకారాలతో,శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట రోటరీ క్లబ్ ప్రోత్సాహంతో డయాలసిస్ మిషిన్లు, యనిస్తేషియా మిషిన్లు ఇటీవల ప్రభుత్వ వైద్య శాలకు అందించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే పేషంట్లకు ట్రీట్మెంట్ బాగా అందుతుందా లేదా అని ఆసుపత్రికి విచ్చేసి పేషంట్లను పలకరించారు అనంతరం ప్రభుత్వ వైద్యం ఎలా ఉందని అడగటం జరిగిందని తెలిపారు. రాబోవురోజుల్లో పేషేంట్లకు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మెరుగైన చికిత్స కోసం కావాల్సిన వైద్య పరికరాలు కూడా ఇవ్వడానికి సహాయ సహకారాలు అందిస్తామని వక్తలు హామీ ఇచ్చారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్

Related posts

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి గిడుగు రామ్మూర్తి పురస్కారం

Satyam NEWS

దళిత బంధు అమలుకు పకడ్బందీ చర్యలు

Sub Editor 2

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Sub Editor

Leave a Comment