27.7 C
Hyderabad
April 20, 2024 00: 01 AM
Slider కృష్ణ

25న ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సదస్సు

#MuslimMinorities

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలను ఎంతవరకు అమలు అయ్యాయి అనే అంశంపై విజయవాడ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు ఫారూఖ్ షిబ్లీ తెలిపారు.

విజయవాడలోని సిద్దార్ధ కాలేజీ వద్ద ఉన్న కె.స్ట్రీట్ హోటల్ లో ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజా సంఘాలను, జర్నలిస్టులను, న్యాయవాదులను, ఆలోచనాపరులను, రాజకీయ పార్టీల ప్రతినిధులను కలుపుకొని ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు పాల్గొనేలా రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని ఆయన వివరించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశం అనంతరం ముస్లిం మైనారిటీలకు రావలసిన హక్కులను సాధించుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Related posts

LRS పేరిట భారీ పెనాల్టీలు రద్దు చేయాలని CPM ధర్నా

Satyam NEWS

ఇంతింతై వటుడింతై: డిప్యూటీ స్పీకర్ స్థానికి విజయనగరం వీరుడు

Satyam NEWS

సుప్రీం కోర్టు లో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment