39.2 C
Hyderabad
March 29, 2024 16: 58 PM
Slider వరంగల్

ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలి

#TribalUniversity

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది.

రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో నేడు జరిగిన ఈ సమావేశానికి న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి బొమ్మెర సాంబయ్య అధ్యక్షత వహించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ హాజరై మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ఆయన కోరారు.

తమ డిమాండ్ల సాధన కోసం 25వ తేదీన గాంధీ విగ్రహం ముందు నిరాహార దీక్ష చేయాలని సమావేశం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఎమ్మెల్సీ గా పోటీ చేసే అభ్యర్థులు ఈ సమస్యల పైన వాగ్దానాలు హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

ఎంతటి వారికైనా విద్యాబుద్ధులు నేర్పేది గురువే

Satyam NEWS

మంత్రులతో కే‌సి‌ఆర్ అత్యవసరభేటి

Sub Editor 2

ఆంధ్రప్రదేశ్ మహిళా భక్తులకు శబరిమలలో చుక్కెదురు

Satyam NEWS

Leave a Comment