39.2 C
Hyderabad
March 28, 2024 14: 35 PM
Slider ప్రత్యేకం

ఎంపి రఘురామ ఫిర్యాదుతో హోం మంత్రికి తీరని కష్టం

#raghuramakrishnamraju

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుతో ఏపి హోం మంత్రి మేకతోటి సుచరిత కు ఊహించని దెబ్బ తగిలింది. ఒక్క సారిగా జరిగిన పరిణామాలతో హోం మంత్రి మేకతోటి సుచరిత హతాశురాలయ్యారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపి ప్రభుత్వంలో జరిగే ప్రజావ్యతిరేకత, చట్ట వ్యతిరేక పనులపై తన స్థాయిలో తాను పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వంతో పోరాడి చాలా విషయాలలో ఆయన విజయం సాధిస్తున్నారు కూడా. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్నో అంశాలలో ఎంతో మేలు జరిగింది. తాజాగా ఆయన వారం రోజులు క్రిందట చేసిన ఒక ఫిర్యాదు విషయంలో కూడా విజయం సాధించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ఇన్ కమ్ టాక్స్ డిపార్టుమెంటులో ఒక ఉన్నతాధికారి.

ఆయన గతంలో ముంబై, హైదరాబాద్ ఇలా ఇతర రాష్ట్రాల్లో పని చేసారు. అయితే ఆయన భార్య రాష్ట్రానికి హోం మంత్రి కావడంతో లాబీయింగ్ చేసుకుని విజయవాడ బదిలీ చేయించుకున్నారు. పది రోజుల క్రితం ఆయనను విజయవాడకు ట్రాన్స్ ఫర్ చేసారు. రాష్ట్రంలో పోలీసు శాఖ ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు ఇప్పటికే పలు రకాల ఆరోపణలు ఉన్నాయి.

పుంఖాను పుంఖాలుగా అభ్యంతరాలు

పోలీసుల నుంచి దారుణమైన అణచివేతను ప్రతిపక్షాలు అనుభవిస్తుండగా ఆదాయపు పన్ను శాఖలో కీలక ఉద్యోగి కూడా ఇక హోం శాఖ మంత్రి భర్తే అయితే ఇక వేరే విధంగా అనుకోవాల్సింది ఏమీ లేదు. ఈ క్రమంలో ఏకంగా ఒక రాష్ట్ర హోంమంత్రిగా తన భార్య ఉన్నా కూడా, భర్తని అదే రాష్ట్రంలో వేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఆయన బాధ్యతలు స్వీకరించే రోజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకటం పై విమర్శలు వచ్చాయి.

దీంతో వీటి పై బీజేపీకి చెందిన ఒక ఎంపీతో పాటు రఘురామరాజు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. ఐటి కమీషనర్ గా హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ని విజయవాడలో నియమించటం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకం అని తెలిపారు. అంతే కాకుండా ఆయన బాధ్యతలు తీసుకునే సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు కూడా జత పరిచారు.

ఏమైందో ఏమో కానీ, నిన్న హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌ ను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎంత వేగంతో విజయవాడ వచ్చారో, అంతే వేగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ వెళ్ళిపోయారు. దీని వెనుక ప్రధానంగా అమిత్ షా కు ఇచ్చిన ఫిర్యాదే కారణం అని తెలుస్తుంది. అంటే లాబీయింగ్ చేసిన వైసీపీ ఎంపీల కంటే, రఘురామరాజు, ఫిర్యాదు చేసిన మరో బీజేపీ ఎంపీ పవర్, కేంద్రం దగ్గర గట్టిగా పని చేసిందని అర్ధం అవుతుంది. మరి బదిలీ వెనుక అసలు కారణం ఏమిటో మాత్రం అధికారికంగా చెప్పలేదు.

Related posts

టీఆరెఎస్ లో చేరిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

వైఎస్ విజయలక్ష్మి సమావేశానికి మెగాస్టార్ నో

Satyam NEWS

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Satyam NEWS

Leave a Comment