30.7 C
Hyderabad
April 19, 2024 08: 31 AM
Slider ప్రత్యేకం

టిడిపి కార్యాలయాలపై దాడులను ఖండించిన రఘురామ

#raghuramakrishnamraju

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపైనా జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. నేడు జరిగిన దాడులపై సీబీఐ తోనో ఎన్ఐఏ తోనో దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు లేఖ రాశారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, డిజిపి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం దారుణమని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తక్షణమే రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని, పరిస్థితిని అదుపు చేయాలని ఆయన కోరారు.

Related posts

మద్యం మత్తులో దోచిపెట్టి… సంక్షేమం పేరుతో పంచి పెట్టి….

Satyam NEWS

ఎక్స్ ప్లోజన్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని ప్రమాదం

Satyam NEWS

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

Bhavani

Leave a Comment