తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపైనా జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. నేడు జరిగిన దాడులపై సీబీఐ తోనో ఎన్ఐఏ తోనో దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు లేఖ రాశారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, డిజిపి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం దారుణమని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తక్షణమే రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని, పరిస్థితిని అదుపు చేయాలని ఆయన కోరారు.