39.2 C
Hyderabad
April 25, 2024 18: 54 PM
Slider ప్రత్యేకం

నేడే తెలంగాణ లో ఆర్ ఎస్ ఎస్ సంకల్ప్ శిబిరం

rss hyd 25

హైదరాబాద్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ శిబిర్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్ లో తొలి సారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ భారీ శిబిర్ ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నేడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇప్పటికే హైదరాబాద్ వచ్చారు.

మూడు మార్గాలలో ర్యాలీ నిర్వహించి ఎల్ బి నగర్ చౌరాస్తా వద్ద కలుస్తాయి. అక్కడ నుంచి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వైపు వెళతాయి. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. మన్సూరాబాద్ నుంచి ఒక ర్యాలీ, హస్తినాపురం నుంచి మరొక ర్యాలీ, వనస్థలి పురం నుంచి మరో ర్యాలీ వచ్చి ఎల్ బి నగర్ చౌరాస్తాలో కలుస్తాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభ ప్రారంభం అవుతుంది.

మంగళవారంనాడు తెలంగాణ ఆర్ ఎస్ ఎస్ విభాగం క్యాంపును ప్రారంభించింది. ఇందులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నుంచి నాయకులంతా పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, గోషామహల్ మ్మెల్యే రాజా సింగ్, విద్యాసాగర్, ఎం ఎల్ సి రాంచందర్, ఆదిలాబాద్ ఎంపీ సాయం బాపూ రావు, మాజీ ఎంపి జితేంద్ర రెడ్డి, రఘునాదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

“జీవితావలోకనం” పుస్తకావిష్కరణ

Satyam NEWS

బిచ్ కుంద లోక్ అదాలత్ లో 79 కేసుల పరిష్కారం

Satyam NEWS

థాంక్స్ టు మినిష్టర్ కేసీఆర్

Satyam NEWS

Leave a Comment