మత కలహాల కారణంగా నివాసిత గృహాలు కోల్పోయిన హిందూ బంధువులకు ఆర్ఎస్ఎస్-సేవా భారతి ఇళ్లు నిర్మించేందుకు నడుం కట్టింది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ ఏడాది జనవరి 12 వ తేదీన జరిగిన మత ఘర్షణలో పలువురు హిందువులు ఇళ్లు కోల్పోయారు.
వారికి ఇళ్లు నిర్మించేందుకు ఈ రోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి పూజా కార్యక్రమంలో సంఘ్ ప్రాంత ప్రచారక్ దేవందర్ జీ, సంఘ్ కార్యకర్తలు, హిందూవాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.