27.7 C
Hyderabad
April 24, 2024 09: 33 AM
Slider పశ్చిమగోదావరి

రోడ్డుపై గుంతలు: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు…. తప్పిన ప్రమాదం

#pallevelugu

గోతుల మయంగా ఉన్న రహదారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు తాడేపల్లిగూడెం నుంచి సుమారు 60 మంది ప్రయాణికులతో రావులపాలెం బయలుదేరగా.. జువ్వపాలెం వద్ద రోడ్డుపై గోతులు ఉన్నాయి.

వీటిలోంచి వెళుతుండగా బస్సు స్టీరింగ్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. అదుపు తప్పి పక్కనున్న ఏలూరు కాలువ వైపు బస్సు దూసుకెళ్తుండగా టైర్లకు మట్టి గుట్టలు అడ్డురావడం, డ్రైవర్‌ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో తుప్పల్లోకి వెళ్లి ఆగిపోయింది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులకు మరో బస్సును ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చారు. ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు తాడేపల్లిగూడెం నుంచి సుమారు 60 మంది ప్రయాణికులతో రావులపాలెం బయలుదేరింది.

Related posts

విజయనగరం రైల్వే స్టేషన్ అడ్డాగా మైనర్లతో గంజాయి అమ్మకం

Bhavani

యాదాద్రి శ్రీ‌ ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి ని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి

Satyam NEWS

నేచుర‌ల్ స్టార్ నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’లో “ఇంకోసారి ఇంకోసారి” లిరిక‌ల్ వీడియో 13న విడుద‌ల‌

Satyam NEWS

Leave a Comment