పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు టిఎస్ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ ప్రకటించారు.
ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉదయం తెలంగాణ నుండి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ, ఏపీ మధ్యలో పూర్తిగా మెడికల్ ఏమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.
తెలంగాణ నుండి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగతా వాహనాలు కూడా నిలిపివేశారు. ఏపీ ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.