32.7 C
Hyderabad
March 29, 2024 11: 27 AM
Slider గుంటూరు

యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను సత్కరించిన నరసరావుపేట ఆర్టీసీ డిపో

#narasaraopetrtc

ఎలాంటి రోడ్డు ప్రమాదం కాకుండా వాహనాన్ని జాగ్రత్తగా నడిపిన డ్రైవర్లను గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోలో నేడు సత్కరించారు. ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో గ్యారేజ్ లో నేడు రోడ్డు భద్రతా పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.హెచ్ ప్రభాకర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి నరసరావుపేట డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ జీవిత కాలంలో ఎటువంటి ప్రమాదాలు చేయని యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను సత్కరించారు. అదే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన గ్యారేజీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇచ్చారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల విషయమై డ్రైవర్లు కు, మెకానిక్ లకు, కండక్టర్లు కు నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ కాంపిటీషన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు కు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ఈ అవార్డులు ప్రశంసా పత్రాలు పొందిన ఉద్యోగులు వీరే:      

డ్రైవర్లు Pప్రసాద్, SP రెడ్డి, బెస్ట్ ఎలక్ట్రీషియన్ T సురేష్, బెస్ట్ బ్రేక్స్ మెకానిక్  PP కుమార్, బెస్ట్ KMPL  డ్రైవర్లు PB రావు,   KVK రావు, వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారు K P లత, A L  ప్రసాద్, K C శేఖర్, E A రెడ్డి.     

ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిపో లోని అన్ని అసోసియేషన్ నాయకులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ నిశిత వ్యాఖ్య

Satyam NEWS

అమరావతిపై జగన్ మొండిపట్టుదల వీడాలి

Satyam NEWS

ఉగ్ర రూపం దాల్చిన పెన్నా నది

Satyam NEWS

Leave a Comment