37.2 C
Hyderabad
March 28, 2024 18: 51 PM
Slider తెలంగాణ సంపాదకీయం

ఫేమ్ స్కీమ్ తో ఆర్టీసీపై మెగా కబ్జా?

Olectra-K9-electric-bus

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొత్త డైరెక్షన్ లోకి వెళుతున్నది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను డిస్మిస్ చేసి కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటున్న ఆర్టీసీ ఇదంతా ఎందుకు చేస్తున్నదో తెలుసా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పుంఖాను పుంఖాలుగా వచ్చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేమ్ (ఫాస్టర్ అడాప్క్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) అనే స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

ఈ స్కీమ్ కింద ఒక్కో ఎలక్ట్రిక్ వెహికిల్ కు దాదాపుగా కోటి రూపాయల వరకూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఈ స్కీమ్ ను ఇప్పటికే చాలా రాష్ట్రాలు వినియోగించుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలో ప్రవేశ పెడుతున్నాయి. ఈ స్కీమ్ ను ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అందులో ఎలాంటి తప్పు లేదు. రావాలి కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కంపెనీకే ఆ కాంట్రాక్టు ఇప్పించుకున్నది.

ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ పేరు చెబితే చాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకే కంపెనీ కనీసం టెండర్లు వేయడానికి కూడా ముందుకు రాదు. ఎందుకంటే మరే కంపెనీ టెండర్ వేసినా వారికి రాదు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో మెగాకే టెండర్లు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు టిఆర్ఎస్ కు స్నేహ పూర్వక పార్టీ అయిన వైసిపినే అధికారంలో ఉన్నందున అక్కడ కూడా మెగా కంపెనీకి ఎదురు లేకుండాపోతున్నది.

ఇటీవల ఏపి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసుకురాగానే అక్కడ మెగా మెరుపు మెరిచింది. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ లో రూ. 800 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి అందరి దృష్టిలో పడ్డారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కూడా ఇప్పుడు ఇదే కంపెనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టిందో కానీ ఆ అవకాశాన్ని మెగా కంపెనీ మాత్రం చక్కగా వాడుకుంది.

గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి ఓలెక్ట్రా కంపెనీని మెగా టేకోవర్ చేసింది. ఈ ఓలెక్ట్రా కంపెనీ తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసి రోడ్లపై తిప్పేందుకు కాంట్రాక్టు పొందింది. ముందే చెప్పినట్లు మిషన్ భగీరధ టెండర్లు అయినా కాళేశ్వరం అయినా మెగా కంపెనీకి రావాల్సిందే కదా అదే కోవలో ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ కూడా అదే కంపెనీకి వచ్చేసింది. నిన్న ఆర్టీసీ సమ్మె పరిస్థితిపై సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీలో సగం బస్సులు సంస్థవి, మరో సగం ప్రయివేటు వారికి ఇచ్చేద్దాం అని ప్రతిపాదించారు.

దాంతో ఒక్క సారిగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ నుంచి 40 ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు పొందిన ఓలెక్ట్రా కు అంటే మెగా కృష్ణారెడ్డికి ఆర్టీసీని ధారాదత్తం చేయడానికే కేసీఆర్ ఈ విధమైన ప్రకటన చేశారని అందరూ భావిస్తున్నారు. ఏపీలోనూ ఆ కాంట్రాక్ట్ కోసం మెగా ప్రయత్నాలు చేస్తూండటంతో ఇక తెలంగాణలో సగం అద్దె బస్సులు మేగా కృష్ణారెడ్డికేనా అన్న చర్చ ప్రారంభమయింది. కన్స్ట్రక్షన్ కార్యకలాపాల్లో చురుకుగా ఉండే మేగా కొన్నాళ్ల కిందట ఎలక్ట్రిక్ బస్సుల వ్యాపారంలోకి వచ్చారు. బస్సుల ఉత్పత్తి ప్రారంభించారు.

అయితే దేశంలో టాటా, అశోక్ లేలాండ్, ఐషర్ లాంటి కంపెనీలతో పోల్చితే ఈ ఒలెక్ట్రా కంపెనీ చాలా చిన్నదే. కానీ తెలంగాణలో బస్సులు నడిపే కాంట్రాక్ట్  దక్కించుకుంది. దీనికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ప్రచారం జరిగింది. ఇప్పుడు తెలంగాణ కార్మిక వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ మేగా బస్సులపైనే. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా కేసీఆర్ వెళ్తున్నారని ఇందులో ప్రధానంగా మేగా కంపెనీకే అవకాశాలు దక్కేలా చేయబోతున్నారని ఆరోపిస్తున్నారు.

అద్దె బస్సులతో ఇప్పటికే సంస్థను పాక్షికంగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారని దానిని అడ్డుకునేందుకు సమ్మె చేస్తూంటే మొత్తానికే ప్రైవేటీకరణ చేస్తున్నారని కార్మికులు అంటున్నారు. అయితే ప్రభుత్వ వివరణ మరొక విధంగా ఉంది. తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేగా పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది అనేది ప్రభుత్వ వివరణ.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు  ఆర్జిచేసేస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మార్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా? అంటూ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఇంచుమించు మూడు దశాబ్దాలుగా ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు.  ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోందనేది ప్రభుత్వ వాదన.

తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. మరి దీనికే కోట్లు తినేస్తున్నారని ప్రచారం చేస్తే ఎలా అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా కార్మిక సంఘాలు చెబుతున్న ఈ విషయాలను అధిక శాతం ప్రజలు నమ్మితే మాత్రం ఆర్టీసీ సమ్మె వేరే మార్గంలోకి వెళ్లడం ఖాయం

Related posts

చిన్నారికి విజయవంతంగా లివర్ మార్పిడి శస్త్రచికిత్స

Satyam NEWS

నిరుద్యోగ పట్టభద్రులు ఓటింగ్ కు రాకుండా వైసీపీ కుట్ర

Satyam NEWS

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం లేదు: షపీకర్ రెహ్మాన్ బుర్కే

Satyam NEWS

Leave a Comment