ప్రధాని నరేంద్రమోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలోని మహాదేవపురంలోని శ్రీమాతా యోగా అన్నపూర్ణేశ్వరీ దేవీ దేవస్థానంలో జగన్ గురూజీ నేతృత్వంలో వేదపండితులు మహా మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, ధన్వంతరి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డి పాల్గొని ప్రధాని నరేంద్రమోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. హోమ నిర్వాహకులు జగన్ గురూజీ మాట్లాడుతూ.. సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుతూ దేశ రక్షణ కోసం, అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర కలకాలం దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.
previous post