వేములవాడ రూరల్ మండలం రుద్రవరం వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఆదివారం ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.సంఘం ఛైర్మన్ గా రేగులపాటి కృష్ణదేవరావు, వైస్ ఛైర్మన్ గానాగుల పర్శ రాములు ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ కృష్ణదేవరావు మాట్లాడుతూ తన ఎన్నికకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు.అనంతరం తన తండ్రి మాజీ శాసన సభ్యులు రేగులపాటి పాపారావు ఆశీర్వాదం తీసుకుని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ను మర్యాద పూర్వకం గా కలిశారు.