మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి ప్రెసిడెంట్ పన్నాల హరీష్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి లకు అత్యంత సన్నిహితురాలైన బిజెపి మేడ్చల్ మల్కాజ్ గిరి డిస్టిట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నాంపల్లి రూప సుధాకర్ రెడ్డి కాప్రా డివిజన్ బిజెపి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , జిల్లా ప్రెసిడెంట్ పన్నాల హరీష్ రెడ్డి , శిల్పా రెడ్డి ల నాయకత్వాన్ని బలపరుస్తూ డివిజన్ లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకము ఉంచి పదవి ఇప్పించినందుకు పన్నాల హరీష్ రెడ్డి , శిల్పారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి