27.7 C
Hyderabad
April 19, 2024 23: 25 PM
Slider నల్గొండ

మండల ఆర్.ఎమ్.పి(రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సంఘం సమావేశం

#RMPsmeeting

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఎం.ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నందు ఆదివారం  హుజూర్ నగర్ మండల(రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్)కమిటీ సమావేశం హుజూర్‌నగర్ మండలం ఆర్ఎంపి సంఘం అధ్యక్షుడు షేక్.మన్సూర్ అలీ అధ్యక్షతన  జరిగింది.

ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఎంపి,పిఎంపి లు చాలా జాగ్రత్తగా  ప్రజలకు ప్రాథమిక వైద్యసేవలు  అందించాలని,ప్రజలు రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకోవటానికి కృషి చేయాలని,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత శుభ్రత,జాగ్రత్తలు  తీసుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు.ప్రతి ఆర్ఎంపి,పిఎంపి గ్రామీణ వైద్యులు తప్పనిసరిగా సంఘ సభ్యత్వం,ఇన్సూరెన్స్ సౌకర్యం పొందాలని,సంఘ సభ్యులు అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు.

సూర్యాపేట జిల్లా ఆర్ఎంపి సంఘం గౌరవాధ్యక్షుడు షేక్.బాబు మాట్లాడుతూ సంఘం సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని,అనుభవజ్ఞులైన డాక్టర్లతో, స్పెషలిస్టులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని,సంఘ సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ మండల ఆర్ఎంపి సంఘం ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు,కోశాధికారి  ఎ.శ్రీనివాస్,సహాయ కార్యదర్శి షేక్.మీరా, సభ్యులు పి.బ్రహ్మం,కె.పూల రాజు,కొండా శ్రీను,ఎం.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మెగాస్టార్ తదుపరి చిత్రం ప్రారంభమైంది

Satyam NEWS

చేసిన పనికి మాకు గుర్తింపు ఇవ్వండి

Satyam NEWS

పేదవారికి నిత్యావసరాలు పంచిన మార్కండేయ సేవా సమితి

Satyam NEWS

Leave a Comment