30.3 C
Hyderabad
March 15, 2025 09: 59 AM
Slider శ్రీకాకుళం

రెండేళ్లల్లో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం

#achemnaidu

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లాయంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి, సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 33 శాతం గిరిజనులు ఉండే ఈ ప్రాంతం పూర్తిగా పేదరికం జిల్లా అని తెలిపారు. ఇటువంటి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, పదవీ కాలంలో చేసిన మంచి పనులే ప్రజల మదిలో చిరస్తాయిగా మిగిలిపోతాయని మంత్రి ఉద్బోధించారు.

అందరి సహకారం, మంచి చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలపై దృష్టి సారించడం కన్నా,స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ కనీస మౌలికవసతులు లేని గ్రామాలపై దృష్టి సారిస్తే కొంత సార్ధకత ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదని, ఆరోగ్యం బాగాలేకపోతే డో్లీ మోతలు తప్పకపోవడం విచారకరమన్నారు. త్వరలో అన్ని మండలాల్లోని రోడ్లు సదుపాయం లేని గ్రామాలను గుర్తించి, రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే తన ముందున్న ధ్యేయమని అన్నారు.

ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి ఆటో లేదా అంబులెన్సు వెళ్లేలా వసతులు కల్పిస్తామని,  వీటితో పాటు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉందని,  ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకరిస్తే కొంతవరకైనా మార్పు తీసుకురాగలననే నమ్మకం తనకు ఉందని ఇంచార్జి మంత్రి స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని, ఇందుకు అవసరమైన నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించుకుంటూ, జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రారంభించి నిలిచిపోయిన పనులను ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా చేపడతామని అన్నారు. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఇప్పటికే జిల్లాపై అవగాహన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం వలన స్థానిక సమస్యలు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ద వహించి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా గుర్తుండిపోయే పనులను చేపడతామని మంత్రి వివరించారు.

పార్వతీపురం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (డిఆర్సీ) సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు కె. అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక రాజేశ్వరి, ట్రైకార్ చైర్మన్ బొరగాం శ్రీనివాసులు, ఎంఎల్సీలు ఇందుకూరి రఘురామ్, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయ కృష్ణ, పార్వతీపురం మునిసిపల్ చైర్మన్ బి. విజయగౌరి, జిల్లా కలెక్టర్

ఎ.శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్వి.మాధవరెడ్డి, జేసీ ఎస్.ఎస్. శోబిక, సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తదితరులు భాగస్వామ్యం అయ్యారు. శ్రీకాకుళం సమగ్ర కలెక్టరేట్ భవనం మాదిరిగా జిల్లాలో కూడా కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరగాలని, ఇప్పటికే కేటాయించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని మంత్రి ఈ సందర్బంగా వివరించారు.

జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కళ్ళాల్లోని ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే మిల్లులకు తరలించాలని మిల్లు యాజమాన్యం ఉపక్రమిస్తే తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. లాభసాటి ఉద్యానవన పంటలపై రైతులు దృష్టి సారించేలా ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల దాడితో రైతులు పండించిన పంటలు నష్టంపోకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎఫ్ఓను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహల్లో ఉన్న పిచ్చి మొక్కలను ఉపాధిహామీ పథకం కింద తొలగించేలా చర్యలు చేపట్టాలని డ్వామా పీడీని ఆదేశించారు.

గ్రామ సచివాలయాల్లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య సహాయకుల పోస్టులను సంబంధిత శాఖల పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. త్వరలో వెటర్నరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని, వెటర్నరీ బిల్డింగులను నాబార్డ్ నిధులతో నిర్మిస్తామని అన్నారు. జిల్లాలో సమీకృత భూసార పరీక్షా కేంద్రాన్ని, మత్స్య పెంపక కేంద్రాన్ని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సూపర్ – 6ను తప్పక అమలుచేస్తామని, త్వరలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

జిల్లాలో రూ. 140 కోట్లతో ఆధునిక వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె.హేమలత, సిపిఓ పి. వీర్రాజు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మధరావు, డిపిఓ టి.కొండలరావు, జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి వి. రాధాకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.కృష్ణ, డీఎంసీఎస్ పి.శ్రీనివాసరావు, డ్వామా పీడి కె.రామచంద్రరావు, ఐసిడిఎస్ పిడి ఎం.ఎన్.రాణి, జిల్లా ఉద్యానవన అధికారి కె.ఎస్.వరప్రసాద్, జిల్లా మత్స్య శాఖాధికారి వి.తిరుపతయ్య,జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుమలనాయుడు, ఇరిగేషన్ ఈఈ ఆర్.అప్పలనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.విజయపార్వతి, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా. ఎం.ప్రవీణ్ కుమార్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎండీ.గయాజుద్దీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈస్ట్ ఇండియా కంపెనీలాగా దేశాన్ని దోచుకుంటున్న అదానీ

Satyam NEWS

తెలుగుదేశం శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం: డాక్టర్ చదలవాడ అరెస్టు

Satyam NEWS

కొల్లాపూర్ కోటలో ప్లాట్లు కొంటే ఆగమౌతారు జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment