ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. ఆయనతో బాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా తాను తన కుటుంబ సభ్యులు జ్వరంతో బాధపడుతున్నామని రాజమౌళి తెలిపారు.
క్రమంగా జ్వరం తగ్గినా అనుమానంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నామని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటీవ్ వచ్చిందని వైద్యులు క్వారంటైన్లో ఉండమని సూచించారని ఆయన అన్నారు. వైద్యుల సూచనలను పాటిస్తాం అని రాజమౌళి చెప్పారు.