ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ వి ప్రసాద్ కన్నుమూశారు.
మరింత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయన సతీమణి కూడా నేడు మరణించారు.
కరోనా బారిన పడిన ఎస్ వి ప్రసాద్ కుటుంబం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు మూడు రోజులుగా ఎస్ వి ప్రసాద్, ఆయన సతీమణి సీరియస్ కండిషన్ లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన, ఆయన సతీమణి ఆరోగ్యం మెరుగు పడలేదు.
కొద్ది గంటల వ్యవధిలో దంపతులు కన్నుమూశారు.
నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా ఎస్వీ ప్రసాద్ కు గుర్తింపు ఉంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎందరో ముఖ్యమంత్రుల వద్ద పని చేసిన ఆయన అందరికి తలలో నాలుకలా ఉండేవారు.
సౌమ్యుడు, సహృదయుడు అయిన ఎస్ వి ప్రసాద్ యువ ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలుస్తారు.