ప్రస్తుత ఓమిక్రాన్ పరిస్థితుల వల్ల శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం తపాలాశాఖ ద్వారా శబరిమల ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ములుగు తపాలా శాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టు ch.రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి గాను దగ్గరలోని పోస్టాఫీసులొ (450) నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించి ఆర్డర్ చేస్తే నేరుగా మీ ఇంటికే ప్రసాదం ప్యాకెట్ అందుతుందని, అంతేగాకుండా తపాలాశాఖ మైక్రో ఏటీఎంల ద్వారా రైతుబంధు నగదును ఎలాంటి రుసుము లేకుండానే ఆధార్ అనుసంధానంతో నగదు లబ్ధిదారులకు అందిస్తున్నామని ఆధార్ అనుసంధానం లేనివారు మీ దగ్గర్లోని సమీప తపాలా కార్యాలయంలో సంప్రదించగలరని అన్నారు.
previous post