కాంగ్రెస్ అధ్యక్ష రేసులో సీఎం అశోక్ గెహ్లాట్ చేరడంతో రాజస్థాన్లో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. సచిన్ పైలట్ రాజస్థాన్ తదుపరి సీఎం అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే గెహ్లాట్ హయాంలో సచిన్ పైలట్ సీఎం పదవిని చేపట్టడం అంత ఈజీ కాదు. అశోక్ గెహ్లాట్ ఎవరి తప్పును మరచిపోరని, క్షమించరని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ పైలట్ తిరుగుబాటును మర్చిపోయి సీఎం గెహ్లాట్ ఆయనకు అధికారం అప్పగించడం అంత తేలిక కాదు.
సచిన్ పైలట్ తిరుగుబాటు వల్ల పార్టీ పట్ల ఆయనకున్న విధేయతపై అనుమానం వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అశోక్ గెహ్లాట్ ను కాదని సచిన్ పైలట్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇది సాధ్యం కాకపోవచ్చు. రాజస్థాన్కు సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్రంలో సచిన్ పైలట్ ఏకపక్షంగా వ్యవహరించడానికి అనుమతించరు.
అలాగే రాజస్థాన్లో పైలట్కు కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వదు. అశోక్ గెహ్లాట్ తన సిఎం పదవిని వదులుకోవలసి వస్తే, పైలట్ ఏకపక్షానికి చెక్ పెట్టేందుకు ఇద్దరు ఉపముఖ్యమంత్రులను పెట్టాలని ఆదేశాలు ఇవ్వవచ్చు. జనవరి 25, 2003న సీఎం గా బాధ్యతలు చేపట్టిన గెహ్లాట్ కూడా ఇదే విధమైన రాజకీయం ఆడారు. కమలా బేనీవాల్, బన్వారీ లాల్ బైర్వాలను ఉపముఖ్యమంత్రులుగా చేశారు. అటువంటి పరిస్థితిలో, గెహ్లాట్ తన విశ్వాసపాత్రులైన ఇద్దరు మంత్రులను ఉపముఖ్యమంత్రులుగా చేసే పనిలో ఉన్నారు.
దీంతో సచిన్ పైలట్కు ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చు కానీ గెహ్లాట్కు కూడా నష్టం వాటిల్లదు. రాజస్థాన్లో ఉప ముఖ్యమంత్రులను చేసే సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించింది. భైరోన్ సింగ్ షెకావత్ తొలిసారిగా హరిశంకర్ భభాడాను డిప్యూటీ సీఎంగా నియమించారు. దీని తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సంప్రదాయాన్ని బాగా క్యాష్ చేసుకుని 2003లో ఇద్దరు డిప్యూటీ సీఎంలను చేశారు. 2018లో సీఎం గెహ్లాట్ సచిన్ పైలట్ను ఉప ముఖ్యమంత్రిగా చేశారు.
SC-ST ఓటు బ్యాంకును పదిల పరచుకోవడానికి సిఎం గెహ్లాట్ తన సన్నిహిత మంత్రి భజన్లాల్ జాతవ్, ఆరోగ్య మంత్రి పార్సాది లాల్ మీనాలలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని కోరవచ్చు. 2018 ఎన్నికలలో తూర్పు రాజస్థాన్లో కాంగ్రెస్ 39 సీట్లు గెలుచుకున్నందున గెహ్లాట్ SC-ST ఓటు బ్యాంకు కోసం ఏమైనా చేస్తారు. ధోల్పూర్లో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. గెహ్లాట్ రెండవ డిప్యూటీ సిఎం కోసం బిడి కల్లా, శాంతి ధరివాల్ పేరును ముందుకు తీసుకురావచ్చు.