అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అత్యంత దయనీయ పరిస్థితిలో ఉందనడానికి తాజా ఉదాహరణ ఒకటి జరిగింది. ప్రమాద స్థాయిలో దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు.
నిన్న రాత్రి ఆపరేషన్ గదిలో వర్షం నీరు పడకుండా బకెట్లు అడ్డం పెట్టి ఒక గర్భిణికి ప్రసవం చేయాల్సి వచ్చింది. ఇంతటి దౌర్భాగ్యపు ఆసుపత్రి జిల్లా లో మరెక్కడా లేదని రోగులు అంటున్నారు. పేదలు ఉచిత వైద్య అందించడం ఇలాగేనా అని సర్కార్ దవాఖానా సిబ్బందిపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి, ఓటేసినందుకు ఇలా చేస్తే ఎలా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సిఎం సొంత మండలోనే ఈ దౌర్బగ్యపు పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.