ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లోని యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం లో భాగంగా జరిగిన సదరు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి జెర్రిపోతుల ప్రభుదాస్, బొంతు శ్రీదేవి యాదవ్ లు పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ ఉత్సవాలు యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారని, దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్నారు. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా సదర్ను నిర్వహించుకుంటారని తెలిపారు.
భాగ్యనగరంలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయని, యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ ఈ సంబురాలు జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ రెడ్డి ,కృష్ణ యాదవ్, కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.