యాదవ జాగృతి సేన ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా స్థాయి సదర్ సమ్మేళనం ఈ నెల 20న పెద్దకొత్తపల్లి లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను నేడు యాదవ జాగృతి సేన నాయకులు విడుదల చేశారు. కొల్లాపూర్ పట్టణంలోని మాధవ స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సోదరులు పాల్గొన్నారు. సదర్ పండుగ అనేది యాదవుల చరిత్ర సంస్కృతి తో ముడిపడి ఉన్నది. ఇది జంతువులను ప్రేమించే గొప్ప శాస్త్రీయ పండుగ.
ఈ పండుగను అంగరంగ వైభవంగా 50 వేల మంది యాదవుల హాజరుతో పెద్దకొత్తపల్లి లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 20 శనివారం నాడు జరిగే ఈ పవిత్ర సదర్ పండుగ లో యాదవ సోదరులు అందరూ పాల్గొనాలని వారు ఆహ్వానించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని యాదవ బంధువులు పార్టీలకతీతంగా, ఐక్యమత్యంతో జాతరకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చట్టమోని విష్ణు మూర్తి యాదవ్, బారిగెల బాలయ్య యాదవ్, మేకల రాముడు యాదవ్, ఆకునమోని రాము యాదవ్, బరిగెల వేణు గోపాల్ యాదవ్, ఉడుత రామస్వామి యాదవ్, మేకల భాస్కర్ యాదవ్, మేకల మల్లికార్జున్ యాదవ్, ఆకునమోని చంద్రయ్య యాదవ్, పసుల సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.