30.7 C
Hyderabad
April 19, 2024 08: 20 AM
Slider గుంటూరు

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

#MPLavuKrishnadevarayalu

గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నేడు సాగర్ కుడి కాల్వకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నెస్పీ కెనాల్ జిల్లా అధికారులు డివిజన్ అధికారులు స్థానిక అధికారులు మాచర్ల నాగార్జునసాగర్ వైసిపి నాయకులు కార్యకర్తలు పలు గ్రామాల అన్నదాతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ దేవుడి దయవల్ల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందని అందువల్ల ఆగస్టు నెలలోనే సాగు నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.

ఈ విధంగా రైతుల కోరిక నెరవేరిందని ఆయన తెలిపారు. గంటకు 550 క్యూసెక్కుల చొప్పున 1000 క్యూసెక్కుల  నీరు కుడి కాలువ ద్వారా విడుదల అవుతుందని ఆయన వివరించారు.

Related posts

భోగి రోజు మహిళలతో ఆడిపాడిన అంబటి రాంబాబుకు కరోనా

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంత విద్యార్ధులకు పుస్తకాలు పంచిన చింతలపల్లి

Satyam NEWS

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

Satyam NEWS

Leave a Comment