గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నేడు సాగర్ కుడి కాల్వకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నెస్పీ కెనాల్ జిల్లా అధికారులు డివిజన్ అధికారులు స్థానిక అధికారులు మాచర్ల నాగార్జునసాగర్ వైసిపి నాయకులు కార్యకర్తలు పలు గ్రామాల అన్నదాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ దేవుడి దయవల్ల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందని అందువల్ల ఆగస్టు నెలలోనే సాగు నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.
ఈ విధంగా రైతుల కోరిక నెరవేరిందని ఆయన తెలిపారు. గంటకు 550 క్యూసెక్కుల చొప్పున 1000 క్యూసెక్కుల నీరు కుడి కాలువ ద్వారా విడుదల అవుతుందని ఆయన వివరించారు.