28.7 C
Hyderabad
April 20, 2024 10: 50 AM
Slider ఆదిలాబాద్

ముథోల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా సాయినాథ్ నియామకం

ముథోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన సాయినాథ్ ను నియమించారు. పార్టీ కోసం 15 సంవత్సరాల నుండి కష్టపడుతున్న వ్యక్తిని గుర్తించి అతనికి పదవి అప్పగించినందుకు నిర్మల్ జిల్లా అధ్యక్షులు పవర్ రామారావు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డికి బాసర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఇక నుండి బాసర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పైన నిరుద్యోగ సమస్యలపైన పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రాజు దేశాయ్ పార్టీ ప్రధాన కార్యదర్శి జంగం రాజేందర్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు శీను యాదవ్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు రమేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా రధోత్సవం

Satyam NEWS

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

Satyam NEWS

వద్దని చెప్పినా రైతులు మొక్కజొన్న పంట వేశారు

Satyam NEWS

Leave a Comment