కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ప్యాపిలి గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
శనివారం సాయంత్రం 7 గంటల యాభై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి కర్నూల్ కి వెళ్తున్న ఇన్నోవా వాహనం ముందు చక్రం పగిలి ఎదురుగా రోడ్డుకు అటు వైపు వస్తున్న లారీని ఢీకొన్నది.
దాంతో ముగ్గురు మృతి చెందారు.
ఈ సంఘటనలో మరణించిన ముగ్గురిలో కర్నూలు జిల్లా ఆత్మకూరు సాక్షి రిపోర్టర్ సుధాకర్ గౌడ్ కూడా ఉన్నారు.