39.2 C
Hyderabad
March 29, 2024 15: 04 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

#TTD

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధ‌వారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా  శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్క‌రిణిలో తెప్పోత్స‌వాలు నిర్వ‌హించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి  వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు డిపి.అనంత, సిఇ ర‌మేష్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రుణ విత‌ర‌ణ మ‌హోత్స‌వం: సామాన్యుల‌కు సులువుగా రుణాలివ్వండి

Satyam NEWS

Bomb blast: చిన్నారి మృతి: తృణమూల్ కాంగ్రెస్ నేత అరెస్టు

Bhavani

తెలంగాణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం

Satyam NEWS

Leave a Comment