27.7 C
Hyderabad
April 25, 2024 07: 57 AM
Slider హైదరాబాద్

శాల్యూట్: మున్సిపల్ సిబ్బంది సేవలు అమోఘం

Balla Geetha

కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలు అమోఘమని బౌద్ద నగర్ కార్పొరేటర్ దయానంద్ గౌడ్ అన్నారు.

 తెలంగాణ పద్మశాలి ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బల్ల గీతా ఆధ్వర్యం లో శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బందికి ఫలహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి దయానంద గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసి సుమారు 50 మండి సిబ్బందికి టిఫిన్ అందజేశారు.

అనంతరం బల్ల గీత మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు  స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని కోరారు.

ప్రభుత్వం సూచించిన విధంగా ఇండ్లలోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో బాబాయి, బి సాంబయ్య, ప్రవీణ్ తదిరులు పాల్గొన్నారు.

Related posts

మాటలు చెప్పడం తప్ప మోదీకి ఏమీ చేతకాదు

Bhavani

కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ సాధనకై 9న మహా ధర్నా

Bhavani

నిర్భయ దోషుల ఉరి శిక్షకు మళ్లీ డెత్ వారంట్

Satyam NEWS

Leave a Comment