కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలు అమోఘమని బౌద్ద నగర్ కార్పొరేటర్ దయానంద్ గౌడ్ అన్నారు.
తెలంగాణ పద్మశాలి ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బల్ల గీతా ఆధ్వర్యం లో శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బందికి ఫలహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి దయానంద గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసి సుమారు 50 మండి సిబ్బందికి టిఫిన్ అందజేశారు.
అనంతరం బల్ల గీత మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం సూచించిన విధంగా ఇండ్లలోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో బాబాయి, బి సాంబయ్య, ప్రవీణ్ తదిరులు పాల్గొన్నారు.