కరోనా వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో కూడా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనివారికి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నేడు టీ, బిస్కెట్లు అందచేశారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పై జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్న పారిశుద్ధ్య పనివారికి ఏం చేసినా తక్కువేనని ఆమె ఈ సందర్భంగా అన్నారు.
ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సగం సమస్య దూరం అవుతుందని, భౌతిక దూరం పాటిస్తే కరోనా అంతమౌతుందని ఆమె అన్నారు. కరోనా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడమే సమస్యకు పరిష్కారమని ఆయన ప్రధాని నరేంద్రమోడీని కోరారు.